- రామగుండం సీపీ ఎం శ్రీనివాస్
- కమిషనరేట్ లో ఆయుధ, వాహన పూజలు
Ramagundam CP : విజయదశమి అందిరికీ విజయాలు చేకూర్చాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకాంక్షించారు. ప్రజలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాల్లో అగ్రభాగంలో ఉండాలన్నారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాస్ దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ, మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. సమాజంలో చెడును పారదోలేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం వాహన పూజ నిర్వహించి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాలలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, సంపత్, శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, ఎస్ఐ, ఆర్ఎస్ఐ లు, డ్రైవర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల / గోదావరిఖని