one nation one electon

Elections : వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ కు కేబినెట్ ఆమోదం

Elections : దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చైర్మన్ గా ఉన్న కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై కోవింద్ తన నివేదికను మోదీ మంత్రివర్గానికి అందించారు. దీనికి మోదీ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదిందించింది. తర్వాతి ప్రయాణం ముందుకు సాగడం అంత సులభం కాదు. దీని కోసం, రాజ్యాంగ సవరణ ,రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం, ఆ తర్వాతే ఇది అమలు అవుతుంది.

ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిని పార్లమెంటులో ప్రవేశపెడుతుందని భావిస్తున్నారు. అయితే ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి దీనికి రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని బీజేపీ హామీ ఇచ్చింది.

సెప్టెంబర్ 17 నాటికి సూచనలు
మార్చిలో, రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ 18,626 పేజీల నివేదికను సమర్పించింది. మోడీ ప్రభుత్వం 3.0 హయాంలో వచ్చే ఐదేళ్లలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అమలులోకి వస్తాయని హోంమంత్రి అమిత్ షా చెప్పినప్పుడు కేబినెట్ నుంచి ఒక రోజు ముందుగానే అవుననే సిగ్నల్ వచ్చింది. ఈ టర్మ్‌లోగా ఒకే దేశం ఒకే ఎన్నికలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని షా చెప్పారు. గత నెలలో మూడోసారి చారిత్రాత్మకంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అని ప్రస్తావించారు. తరచూ ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధి మందగిస్తున్నదని ఆయన ఉద్ఘాటించారు.

బీజేపీతోనే మిత్రపక్షాలు
బీజేపీ మిత్రపక్షాలు, ఎల్జేపీ అధికారికంగా ఇందుకు మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్ష పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రణాళికకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ప్రకటించారు. ఈ విధానంతో దేశానికి తరచుగా జరిగే ఎన్నికల నుంచి విముక్తి లభించడమే కాకుండా కేంద్రం స్థిరమైన విధానాలు, సాక్ష్యాధారాలతో కూడిన సంస్కరణలపై దృష్టి సారించేందుకు వీలు కలుగుతుందన్నారు.

వన్ నేషన్ -వన్ ఎలక్షన్ అంటే ఏమిటి.. అమలు ఎలా?
భారతీయులందరూ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సమయంలో లేదా అదే సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటు వేస్తారు. ఇదొక్కటే కాదు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలులోకి వచ్చిన వెంటనే, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామపంచాయతీలకు కూడా ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం, ప్రజలు కేంద్ర ప్రభుత్వంతో పాటు కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు వేస్తారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అమలులోకి వస్తే వనరులు కూడా ఆదా అవుతాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *