Thummeti Sammireddy

Thummeti Sammi Reddy: జమ్మికుంట ఏఎంసీ మాజీ చైర్మన్  మృతి

Thummeti Sammi Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి కి శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందారు. సమ్మిరెడ్డి కి అర్ధరాత్రి ఒంటిగంటకు గుండెపోటు రావడంతో వారి కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి వైద్యం చేస్తుండగానే చికిత్స పొందుతూ మృతి చెందారు. తుమ్మేటి సమ్మిరెడ్డి చదువుకునే సమయంలోనే ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకుడిగా కొనసాగారు. మాజీ పీసీసీ కార్యదర్శిగా, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జిగా, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గా తుమ్మేటి సమ్మిరెడ్డి సేవలందించారు. దివంగత మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఏం సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) శిష్యుడిగా రాజకీయ అరంగ్రేటం చేసి కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు అలంకరించారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న సమ్మిరెడ్డి అనుకోకుండా అర్ధరాత్రి ఒక్కసారిగా ఆకస్మికంగా మృతి చెందారు.

శెనార్తి మీడియా,జమ్మికుంట

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *