Ramagudam CP

Ramagundam CP : పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

శెనార్తి మీడియా, మంచిర్యాల:

Ramagundam CP : డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్(Ramagundam Police Commisioner) ఎం శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐ లతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను చట్టపరిధిలో తీర్చాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, ప్రో యాక్టివ్ పోలీసింగ్ ఉండాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో, విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. సమస్యాత్మక, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను ఎస్‌హెచ్ఓలు సందర్శించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో డయాల్ 100, 112 టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీసు సిబ్బందిపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సత్వర స్పందన, అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. డయల్ 100, 112 ద్వారా వచ్చిన ఫోన్ కాల్స్‌కు సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. బాధితులు సహాయం కోసం డయల్ 100 కి ఫోన్ చేస్తారని, ప్రతి పోలీస్ దీనిని గుర్తించాలని తెలిపారు. డయల్ 100, 112 వచ్చే ఫోన్ కాల్ విషయంలో ఎస్ఐ, సీఐ ఏసీపీలు పర్యవేక్షించాలన్నారు. డయల్ 100 కాల్స్ పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. బాధితులకు అందించిన సహాయాలను సైతం రికార్డు చేస్తామని వివరించారు. సిబ్బందికి రివార్డులు ఉంటాయని వెల్లడించారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లు ప్రధాన పాత్ర పోషిస్తూ ,సిబ్బందితో కలిసి పట్టణంలలో, గ్రామాల్లో డయల్ 100, 112లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డయల్ 100 కి కాల్ చేస్తే తాము సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజల్లో మరింత పెంపొందించాలన్నారు. పోలీస్ శాఖ పై ప్రజలకున్న విశ్వాసాన్ని మరింత పెంచుతూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత పోలీసులు బాధితులను చేరుకునే రెస్పాన్స్ సమయాన్ని తగ్గించాలని, తొందరగా సంఘటన స్థలాన్ని చేరుకుంటే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం చూపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ జూమ్ మీటింగ్‌లో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్ఐ లు బ్లూకోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఆర్ఐ లు దామోదర్, మధులు, ఎస్ఐలు, పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *