- మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్
- గాంధీనగర్ లో తనిఖీలు
- నెంబర్ ప్లేట్ లేని 60 మోటార్ బైక్ లు, 5 ఆటో ట్రాలీలు సీజ్
శెనార్తి మీడియా, మంచిర్యాల :
Carden Search: శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని గాంధీనగర్ లో పట్టణ సీఐ బన్సీలాల్, సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తో కలిసి బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని 60 ద్విచక్ర వాహనాలు, 5 ఆటో ట్రాలీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే ప్రజలకు సైబర్ క్రైమ్, గంజాయి, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ రూల్స్, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. మంచిర్యాల లో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే, భూమి సంబంధిత గొడవలలో పాల్గొన్న, అమాయకులను మోసం చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై రౌడీ షీట్ తెరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమం లో టౌన్ సీఐ బన్సీలాల్, ఎస్ఐ లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.