Cyber Crime :దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలతో దోపిడీ

36మంది సైబర్‌ క్రిమినల్స్‌ పట్టివేత
ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా గుజరాత్‌లో అరెస్ట్‌
హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి

Cyber Crime : దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతూ ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టిన 36మంది సైబర్‌ క్రిమినల్స్‌ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు.. నిందితులను ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా గుజరాత్‌లో అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడిరచారు. వీరంతా అక్కడ్నుంచే అమాయకులను అధిక లాభాల పేరిట మోసం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. వల పన్ని నిందితులను అరెస్టు చేశామని శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ఈ 36మంది నిందితులపై సుమారు వెయ్యి కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీరిపై సుమారు 150 కేసులు నమోదైనట్లు వివరించారు. వీటిలో హైదరాబాద్‌ పరిధిలో 20కేసులు నమోదు అయ్యాయి. ఈ 20 కేసుల్లోనే వీరు సుమారు రూ.12కోట్లకు పైగా ఫ్రాడ్‌ చేశారు. వీరు దోచుకున్న నగదులో ఇప్పటికే రూ. 4.4 కోట్లు ఫ్రీజ్‌ చేశాం. ఫ్రీజ్‌ చేసిన డబ్బులో రూ.1.5కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చాం. నిందితుల నుంచి రూ.38లక్షల నగదు, బంగారం, ల్యాప్‌ ట్యాప్స్‌, బ్యాంక్‌ చెక్‌ బుక్స్‌, పాస్‌ బుక్స్‌ సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. షెల్‌ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులనూ సీజ్‌ చేశాం. హైదరాబాద్‌ నగరంలో ట్రేడింగ్‌ పేరిట మోసాలు చేసిన ముగ్గురిని అరెస్టు చేశాం. కనాని, నికుంజ్‌ సహా కిషోర్‌ భాయ్‌ అనే చార్టెడ్ అకౌంటెంట్ ని అదుపులోకి తీసుకున్నాం. ముందుగా నిందితులు మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీ పేరుతో టెలిగ్రాంలో లింక్‌ సెండ్‌ చేస్తారు. అందులో ఇన్వెస్ట్మెంట్‌, ట్రేడిరగ్‌ చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిని ట్రేడింగ్‌ పేరుతో నమ్మించి రూ.61లక్షలు కొట్టేశారు. బాధితుడు డబ్బులు పంపిన అకౌంట్‌ ఆధారంగా దర్యాప్తు చేశాం. ఈ ముగ్గురిపై 142ఫిర్యాదులు ఔఅఖీఖలో నమోదు అయినట్లు గుర్తించాం. వీరిని అరెస్టు చేసి మొబైల్‌, బ్యాంక్‌ డెబిట్‌ కార్డ్స్‌, పాస్‌ బుక్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడిరచారు. మరో కేసులో నిందితులు ఫెడ్‌ ఎక్స్‌ పేరిట మోసాలకు పాల్పడ్డారు. ఈ మోసంలో బాధితులను రకరకాలుగా బెదిరించి డబ్బులు వసూలు చేశారు. నగరానికి చెందిన వృద్ధురాలైన డాక్టర్‌ని నిందితులు మోసం చేశారు. మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేశామని ఆమెకు ఫోన్‌ చేసి బెదిరింపులకు గురి చేశారు. విచారణకు రావాలని ఫేక్‌ ఎఫ్‌ఐఆర్‌, నకిలీ ఆర్బీఐ లెటర్‌, సీబీఐ లెటర్లు పంపించారు. అరెస్టు కాకుండా ఉండాలంటే అడిగినంత డబ్బు పంపాలంటూ భయపెట్టారు. దీంతో ఆమె రూ.1.6కోట్లు నిందితుల ఖాతాకు పంపారు. మోసపోయానని తెలుసుకుని ఫిర్యాదు చేశారు. జులైలో నమోదైన ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశాం. సాగర్‌ ప్రజాపతి, నాథో భాయ్‌ అరెస్టు కాగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.10లక్షలు, పాస్‌ బుక్‌లు, నకిలీ షెల్‌ కంపెనీల స్టాంపులు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో కేసులో ఇన్వెస్ట్మెంట్‌ పేరుతో కేటుగాళ్లు మోసానికి తెరతీశారు. తాము చెప్పినట్లుగా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొట్టేశారు. ముందుగా ఆరేడు సార్లు కొంత లాభాలు ఇచ్చారు. ఆపై పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టగానే బాధితుడిని మోసగించారు. ఈ కేసులో రామ్‌ కోటికి చెందిన వ్యాపారుడి నుంచి ఏకంగా రూ.రెండు కోట్లు కొట్టేశారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేశామని సీపీ వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *