BCCI Contract Details: 2024-25 సీజన్కు సంబంధించిన కేంద్ర కాంట్రాక్టులను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. మొత్తం 34 మంది ఆటగాళ్లను ఈ జాబితాలోకి చేర్చారు. ఈ క్రమంలో, ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి ఆటగాళ్లు మళ్లీ గ్రేడ్-A+లో కొనసాగుతుండగా, గతేడాది లిస్టులో లేకపోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మళ్లీ చోటు దక్కించుకున్నారు.
గ్రేడ్-A+ ఆటగాళ్లకు రూ. 7 కోట్లు
ఈ అత్యున్నత గ్రేడ్లో రోహిత్, విరాట్, జడేజా, బుమ్రా మాత్రమే ఉన్నారు. వారందరికీ వార్షికంగా రూ. 7 కోట్ల చొప్పున వేతనం లభిస్తుంది.
గ్రేడ్-Aలో ఆరుగురు, రూ. 5 కోట్లు
రిషబ్ పంత్ ఈసారి గ్రేడ్-Aలోకి ఎగబాకాడు. గత సంవత్సరం అతను గ్రేడ్-Bలో ఉన్నాడు. పంత్తో పాటు మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, మహ్మద్ షమీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ రూ. 5 కోట్లు చొప్పున వేతనం లభిస్తుంది.
గ్రేడ్-Bలో ఐదుగురు, రూ. 3 కోట్లు
శ్రేయాస్ అయ్యర్ తన ఫామ్తో మళ్లీ కేంద్ర ఒప్పందంలోకి వచ్చాడు. అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ రూ. 3 కోట్లు చొప్పున లభిస్తాయి.
గ్రేడ్-Cలో కొత్తవాళ్లకు అవకాశం
గ్రేడ్-Cలో మొత్తం 19 మందికి అవకాశం దక్కింది. వారిలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ మొదటిసారి ఈ జాబితాలోకి వచ్చారు. గ్రేడ్-C ఆటగాళ్లకు వార్షికంగా రూ. 1 కోటి చొప్పున వేతనం లభిస్తుంది.
కాంట్రాక్ట్ నిబంధనలు
ఏటా కేంద్ర ఒప్పందాలు బీసీసీఐ విడుదల చేస్తుంది. ఒక్కే ఏడాదిలో కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పదిహేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లే ఈ కాంట్రాక్ట్కు అర్హులు.