Mancherial: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి పట్టణంలోని ఫ్లై ఓవరబ్రిడ్జి, ఐబీ చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతంలో బీఆర్ఎస్ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాజీ మంత్రి మహిళా ఎమ్మెల్యే పై ఇష్టానుసారంగా మాట్లాడడం సిగ్గుచేటని సాంప్రదాయాలకు భిన్నంగా మహిళా ఎమ్మెల్యేను ఆగౌరవ పరిచే విధంగా సభలో మాట్లాడిన విధానాన్ని ఖండిస్తూ వెంటనే తాను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని బే షరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసిలు, ఎంపీటీసీ లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల :